అమితాబ్ బచ్చన్ వాఖ్యాతగా హిందీలో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్పతి 12వ సీజన్లో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ రూ. కోటి గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా ప్రాంతానికి చెందిన మోహిత శర్మ 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ఆమె ప్రస్తుతం జమ్మూకశ్మీర్లోని బారీ బ్రాహ్మాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె గురువారం నాటి ఎపిసోడ్లో రూ. కోటి గెలుచుకుంది. మోహిత రూ. కోటి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు కేబీసీ నిర్వాహకులు ఒక వీడియోను తమ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో ఆమె రూ. 7 కోట్ల విలువైన 16వ ప్రశ్నకు చేరుకుంది. కాగా.. ఇదే సీజన్లో బుధవారం నాటి ఎపిసోడ్లో ఢిల్లీకి చెందిన నజియా నాసిమ్ కూడా రూ. కోటి గెలుచుకుంది. ఈ సీజన్లో ఇద్దరు మహిళలు రూ. కోటి గెలుచుకోవడం విశేషం.
మోహితా శర్మ తండ్రి మారుతి కంపెనీలో పనిచేస్తుండగా.. ఆమె తల్లి గృహిణి. ఆమె భర్త రుషల్ గార్గ్ కూడా ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన కూడా గత 20 ఏళ్లుగా కేబీసీలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నారు. కేబీసీలో పాల్గొనడం మరియు తన విజయం వెనుక భర్త ప్రోత్సాహం
ఉందని మోహిత తెలిపారు. కాగా.. మోహిత రూ. 7 కోట్ల ప్రశ్నకు సమాధానం చెబుతుందా లేదా అనే విషయం నవంబర్ 17న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్లో తెలియనుంది.
Thank you? https://t.co/BhWaqZ7pvg
— Mohita Sharma Garg (@mohita_ips) November 13, 2020
For More News..