ఇరాన్ హెచ్చరిక : లక్షల మంది ప్రాణాలకు ముప్పు

ఇరాన్ హెచ్చరిక : లక్షల మంది ప్రాణాలకు ముప్పు

టెహ్రాన్: కొవిడ్–19 అడ్వైజరీని పాటించకపోతే లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. 16 వేల కరోనా పాజిటివ్ కేసుల్లో 135 మంది మరణించారని, ఇప్పటివరకు మృతుల సంఖ్య 988 పెరిగిందని ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. హెల్త్ గైడెన్స్ లను ఉల్లంఘించి ప్రయాణాలుచేస్తే పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించింది.  నవ్ రోజ్ (పర్షియన్ కొత్త సంవత్సరం) ఉన్నందున సిటీల నుంచి సొంతూళ్లకు వెళ్లేవాళ్లకు అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు. అయితే క్వారంటైన్ లో ఉండేందుకు జనం నిరాకరిస్తున్నారు. దీంతో ఈ హెచ్చరికలు జారీ చేసింది. జోర్డాన్ లో స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 10 మందికిపైగా గుమిగూడటాన్ని నిషేధించారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది