టెహ్రాన్: ఇరాన్లో అల్లర్లకు పాల్పడుతున్న జాతీయ, అంతర్జాతీయ క్రిమినల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు.
తాము యుద్ధానికి దిగబోమని, అదేటైంలో క్రిమినల్స్ను శిక్షించకుండా వదలబోమని ప్రకటించారు. తమ దేశంలో నిరసనకారులను రెచ్చగొట్టి, అల్లర్లు జరిగేలా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కుట్ర పన్నాయని ఫైర్ అయ్యారు.
అమెరికా మిలటరీ బేస్లపై తాము దాడులకు సిద్ధమవుతున్నామన్న వార్తలను ఆయన ఖండించారు. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని స్పష్టం చేశారు.
కాగా, ఇరాన్లో గత నెల 28 నుంచి జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 500 మంది పోలీసులు సహా 5 వేల మంది చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి అష్ఘర్ జహంగీర్ వెల్లడించారు.
