న్యూఢిల్లీ: ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలను సెప్టెంబర్ నాటికి దాఖలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయమై ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ పబ్లిక్ ఆఫర్ కోసం మర్చంట్ బ్యాంకర్లను నియమించామని అన్నారు. రాబోయే 3–-4 నెలల్లో డీఆర్హెచ్పీని దాఖలు చేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే చెప్పారు.
మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పరిధిలోని ఇరెడా రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు లోన్లు ఇస్తుంది. ఎకనామిక్ అఫైర్స్పై ఏర్పాటు చేసిన క్యాబినెట్ కమిటీ ఇందులో ప్రభుత్వ వాటాను కొంతవరకు అమ్మడానికి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లాలన్న ప్రపోజల్ను ఆమోదించింది. ప్రభుత్వం నాన్ -బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన ఇరెడాకు కేంద్రం 2022 మార్చి లో రూ. 1,500 కోట్ల మూలధనాన్ని ఇచ్చింది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో ఇరెడా రూ.865 కోట్ల ఆల్ టైమ్ హై నికర లాభాన్ని నమోదు చేసింది.