
- కన్నెపల్లి సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెలుగులోకి
బెల్లంపల్లిరూరల్, వెలుగు: కన్నెపల్లి మండలంలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు సంబంధించి పని ప్రదేశాల్లో వర్క్నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకుండానే బిల్లులు చెల్లించిన విషయం బయటపడింది. 2024–-25 సంవత్సరానికి గానూ మండలంలోని 15 గ్రామాల్లో చేసిన పనులపై శుక్రవారం కన్నెపల్లి రైతు వేదికలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో పీడీ కిషన్హాజరయ్యారు.
ఈ సందర్భంగా గ్రామసభ తీర్మానం, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారి అనుమతి లేకుండానే ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ కుమ్మక్కై నేమ్ బోర్డులకు సంబంధించిన రూ.5.58 లక్షలను ఓ టెక్నికల్ అసిస్టెంట్బంధువైన బానోత్ నంద అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. దీనిపై డీఆర్డీవో పీడీ సీరియస్ అయ్యారు.
డబ్బులు జమ చేసి, 6 నెలలు గడుస్తున్నా బోర్డులు పెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. 10 రోజుల్లో ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని, లేకుంటే బిల్లులు రికవరీ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని చెక్డ్యాంలు, ఇతర పనులపైనా పంచాయతీ కార్యదర్శులు ఆయనకు ఫిర్యాదు చేశారు.