- పాలమూరులో సర్వే మంత్రి హత్యకు కుట్ర ఫేక్ అని వందశాతం చెప్పారు
- సీఎంకు దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
- మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి
మహబూబ్ నగర్: ఉద్యమకారుడికి ఆశ్రయం ఇవ్వటం తప్పా ? అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. గెలిచినా,ఓడినా నేను ప్రజల మద్య నే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ‘నాకు ఎవరూ శత్రువులు లేరు..నేను ఢిల్లీ షెల్టెర్ ఇవ్నలేదు..ఆతిధ్యం ఇచ్చాం..తప్పుచేస్తే జైలుకు పోవటానికి సిద్దం..’ అని జితేందర్ రెడ్డి అన్నారు. సీఎంకు దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
పాలమూరులో సర్వే చేస్తే మంత్రి హత్యకుట్ర కేసు ఫేక్ అని 100 శాతం మంది అభిప్రాయపడ్డారని ఆయన వెల్లడించారు. నా ఇంటిపై దాడి జరిగితే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లి అక్రమకేసుల విషయాన్ని తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
సమగ్ర ఆరోగ్య సమాచారంతో హెల్త్ ప్రొఫైల్
సీఎం జగన్పై హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు