విద్యార్థుల ప్రాణాలకన్నా క్యాంపు రాజకీయాలే ముఖ్యమా..?

విద్యార్థుల ప్రాణాలకన్నా క్యాంపు రాజకీయాలే ముఖ్యమా..?

కరీంనగర్: విద్యార్థుల ప్రాణాల కన్నా క్యాంపు రాజకీయాలు ముఖ్యమయ్యాయని ఎమ్మెల్యే రవిశంకర్ ను నిలదీశారు బీఎస్పీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా చొప్పదండి బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్ లో నిన్న  పుడ్ పాయిజన్ అయి బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నబాధిత విద్యార్థినులను పరామర్శించేందుకు రాత్రి హాస్పిటల్ కు వెళ్లారు ఎమ్మెల్యే రవిశంకర్.
విద్యార్థుల పరామర్శకు ఎమ్మెల్యే ఆలస్యంగా రావడంపై నిలదీశారు పలువురు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు. నిన్నటిదాకా బెంగళూర్ లో ఉండి ఇంత ఆలస్యంగా ఆసుపత్రికి వస్తారా ? అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. విద్యార్థుల ప్రాణాల కన్నా క్యాంపు రాజకీయాలు ముఖ్యమైయ్యాయా? అని నిలదీశారు.