యానిమల్ సీక్వెల్ కోసం సూపర్ స్కెచ్.. ఈసారి రష్మిక కాదట!?

యానిమల్ సీక్వెల్ కోసం సూపర్ స్కెచ్.. ఈసారి రష్మిక కాదట!?

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy Vanga) తెరెకక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). రణ్బీర్ కపూర్(Ranbir kapoor), రష్మిక మందన్నా(Rashmika mandanna) కాంబోలో వచ్చిన ఈ వైలెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఎమోషనల్ అండ్ వైలెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో నెక్స్ట్ లెవల్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. దాదాపు రూ.260 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.700 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 

ఇక సినిమా చివర్లో యానిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ కూడా ఉండనుందని చెప్పి ఆడియన్స్ లో ఆసక్తిని పెంచాడు సందీప్ రెడ్డి వంగ. దీంతో ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ గా మారుతోంది.

ఇక తాజాగా యానిమల్ సీక్వెల్ కు సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. యానిమల్  సినిమా సీక్వెల్ కోసం హీరోయిన్ ను మార్చనున్నాడట సందీప్. యానిమల్ సినిమాలో తన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది రష్మిక మందన్నా.. కానీ రెండో పార్టీ లో ఆమె స్థానంలో మళయాళ భామ మాళవిక మోహనన్ ను తీసుకోనున్నారని న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక యానిమల్ పార్క్ గా వస్తున్న సీక్వెల్ మొదటి పార్ట్ కన్నా చాలా వైలెంట్ గా ఉంటుందని సందీప్ ఇప్పటికే చెప్పేశాడు. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియాలంటే  అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.