న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ ఆర్మీ, హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ మధ్య యుద్ధం నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో సంఘ విద్రోహ శక్తులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని సెక్యూరిటీ ఏజెన్సీలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
శుక్రవారం ప్రార్థనల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇజ్రాయెల్ ఎంబసీ, యూదు మత సంస్థలున్న ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు. దేశంలోని ఇజ్రాయెల్ పౌరులనూ అలర్ట్ చేశారు.