ఇరాన్తో యుద్ధం.. ఇండియాకు ఇజ్రాయెల్ క్షమాపణ.. కారణం ఇదే!

ఇరాన్తో యుద్ధం.. ఇండియాకు ఇజ్రాయెల్ క్షమాపణ.. కారణం ఇదే!

ఇరాన్ vs ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఒకదేశం పైకి మరో దేశం భీకర దాడులకు దిగుతున్నాయి. రెండు దేశాల్లో మిస్సైళ్ల వర్షం కురుస్తోంది. ఇరాన్ కు కీలక కమాండర్లను, న్యూక్లియర్ సైంటిస్టులను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అదే సమయంలో ఇజ్రాయెల్ పైకి మిస్సైళ్ల దాడిని తీవ్రతరం చేసింది ఇరాన్. 

ఇరు దేశాల మధ్య బాంబుల మోత మోగుతున్న సమయంలో ఇజ్రాయెల్.. భారత్ కు క్షమాపణ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ వద్ద ఉన్న మిస్సైళ్లు ఎంత రేంజ్ వరకు వెళ్తాయి.. దీంతో ఏ ఏ దేశాలకు నష్టం ఉందో చెబుతూ ఇజ్రాయెల్ ఒక మ్యాప్ ను రిలీజ్ చేసింది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ కే కాదు.. చుట్టు పక్కన వందల, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలకు కూడా ముప్పు పొంచి ఉందని మ్యాప్ విడుదల చేసింది. 

ఇరాన్ ప్రపంచ దేశాలకే ఒక ప్రమాదమని.. అణుబాంబులు తయారు చేస్తూ అంతర్జాతీయ అణు ఒప్పందాలను ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ ను మధ్యలో ఉంచి దాని చుట్టు పక్కల ఉన్న దేశాలకు ఎంత వరకు ఇరాన్ మిస్సైల్స్ ను ప్రమాదం ఉందో లెక్కలతో సహా తెలిపింది ఇజ్రాయెల్. ఇరాన్ నుంచి 300 km, 500 km, 800 km, 1,300 km, and 2,000 km వరకు అంటే చుట్టూ ఉన్న మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, సౌత్ ఆసియా, యూరోప్, ఆసియా నౌకా కేంద్రాలు అన్నింటికీ ఇరాన్ నుంచి ప్రమాదం పొంచి ఉందని మ్యాప్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది.

ఇజ్రాయెల్ విడుదల చేసిన మ్యాప్ పై భారత పౌరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ను ట్యాగ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇజ్రాయెల్ బహిరంగ క్షమాపణ కోరింది. దీనికి కారణం.. ఆ మ్యాప్ లో కశ్మీర్ ను తప్పుగా చూపటమే. కశ్మీర్ ఇండియాలో అంతర్భంగా అన్నట్లుగా కాకుండా.. కశ్మీర్ లేని ఇండియా మ్యాప్ ను అందులో చూపించింది. దీనిపై భారత్ కు బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించింది. 

►ALSO READ | ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి.. రేడియేషన్ ధాటికి జనం పరుగులు.. ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు..?

జమ్ము-కశ్మీర్ ను పాకిస్తాన్ లో అంతర్భాగం చూపడం పెద్ద పొరపాటు జరిగిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఎక్స్ లో పోస్ట్ ద్వారా క్షమాపణ కోరింది. బోర్డర్స్ ను గుర్తించడంలో ఆ మ్యాప్ లో తప్పు దొర్లిందని పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ పోస్ట్ పై భారత్ అధికారికంగా ఇంకా స్పందించలేదు. 

అయితే జమ్మూ -కశ్మీర్ తో పాటు పాక్, చైనా ఆక్రమించిన పీఓకే, లడఖ్ ప్రాంతాలు ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగమేనని ఇప్పటికే భారత్ ఎన్నోసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.