బాబు బలగం : మియాపూర్ మెట్రోస్టేషన్ గేట్లు మూసివేత.. హడావిడి

బాబు బలగం : మియాపూర్ మెట్రోస్టేషన్ గేట్లు మూసివేత.. హడావిడి

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్ సిటీలోని 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' పేరుతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరకు.. పెద్ద సంఖ్యలో చంద్రబాబు మద్దతుదారులు తరలివచ్చారు. నల్ల టీషర్టులు ధరించి మియాపూర్ నుంచి ఎల్బీనగర్  మెట్రోలో ప్రయాణిస్తూ తమ నిరసన తెలిపారు. ఆందోళనలో భాగంగా.. మియాపూర్ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేశారు.. కొద్దిసేపు హడావిడి చేశారు. ప్రయాణికులను మెట్రో స్టేషన్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 

విషయం తెలిసిన పోలీసులు మియాపూర్ మెట్రోస్టేషన్ చేరుకున్నారు. స్టేషన్ గేట్లు బలవంతంగా ఓపెన్ చేయించారు. భారీగా మోహరించారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులను మెట్రోస్టేషన్లలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ప్రయాణికులు అందరినీ తనిఖీలు చేసి లోపలికి పంపించారు.

మియాపూర్ మెట్రో స్టేషన్ ప్లాట్ ఫాంపైన కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నల్ల టీషర్ట్ లు ధరించి మెట్రోలో ప్రయాణించిన పలువురు ఐటీ ఉద్యోగులను.. భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Also Read :- చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్'