వామ్మో.. ఇంకా ఇంటి నుంచే పని చేయాల్నా?

వామ్మో.. ఇంకా ఇంటి నుంచే పని చేయాల్నా?
  • విసిగిపోతున్న ఐటీ ఉద్యోగులు
  • పొద్దున్నుంచి రాత్రి దాకా పనితో ఆరోగ్య సమస్యలు
  • ఫిజికల్​, మెంటల్​ స్ట్రెస్​తో పరేషాన్.. కౌన్సిలింగ్​కు డాక్టర్ల దగ్గరికి  
  • ఈ ఏడాదంతా వర్క్​ ఫ్రం హోంకు కంపెనీల ఏర్పాట్లు

హైదరాబాద్​, వెలుగు: కరోనా సెకండ్​ వేవ్​తో ఐటీ ఉద్యోగులు పరేషాన్​ అవుతున్నారు. లాక్​డౌన్​ తొలి రోజుల్లో వర్క్​ ఫ్రమ్​ హోం బాగానే ఉందనుకున్నా తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిందని, వ్యాక్సిన్​ కూడా వచ్చిందని ఖుషీ అవుతున్న టైమ్​లోనే సెకండ్ వేవ్​ వచ్చింది. దాంతో వర్క్​ఫ్రమ్​ హోం ఎక్స్​టెండ్​ అయి టెన్షన్​కు గురవుతున్నారు. మార్చిలో ఫుల్​స్టాఫ్​తో ఆఫీసులు స్టార్ట్​ చేయాలనుకున్న కంపెనీలు తమ డెసిషన్​ను జూన్​కు పోస్ట్​పోన్​ చేశాయి. జూన్​లో స్టార్ట్​ కావాల్సిన కంపెనీలు ఇయర్​ ఎండ్​ వరకు వర్క్​ ఫ్రమ్​ హోం చేయాలని స్టాఫ్​కు చెప్తున్నాయి. గూగుల్​, మైక్రోసాఫ్ట్​ లాంటి కొన్ని ఎమ్మెన్సీలైతే  ఓపిక ఉన్నన్ని రోజులు ఇంటి నుంచే పని చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఐటీ ఎంప్లాయీస్​ మాత్రం వర్క్​ ఫ్రం హోం వల్ల  ఫిజికల్​, మెంటల్​ సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు డాక్టర్లను కలిసి కౌన్సిలింగ్​ తీసుకుంటున్నారు. 
ఏడాదిగా ఇంటి నుంచే పని గత ఏడాది మార్చిలో లాక్​డౌన్​తో హైదరాబాద్​లోని అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్​ ఫ్రమ్​ హోం ఆప్షన్​ను ఇచ్చాయి. ఆ టైంలో బయట రాష్ట్రాల వాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇక్కడి వాళ్లు కూడా కొందరు సిటీలో ఎందుకని తమ పల్లెలకు పయనమైపోయారు. కొందరు మాత్రమే సిటీలో ఉండిపోయారు. తొలుత అందరూ హాయిగా ఇంటి నుంచి ఆడుతూ పాడుతూ పని చేశారు. ఈ ఆప్షన్​ చాలా బాగుందని మురిసిపోయారు.  కొన్నిరోజుల నుంచి ఎప్పుడెప్పుడు దీన్నుంచి బయటపడతామా అంటూ ఎదురుచూస్తున్నారు. లాంగ్​ వర్కింగ్​ అవర్స్​ అవుతున్నాయని, వీకెండ్​లో కూడా వర్క్​ చేయాల్సి వస్తోందని, గంటల తరబడి ఫోన్​ కాల్స్​లో ఉండాల్సి వస్తోందని, ఇంటర్​ పర్సనల్​ స్కిల్స్​  దెబ్బతింటున్నాయని బాధపడుతున్నారు. ఇంట్లోనే నెలల తరబడి ఉండడం వల్ల విసిగిపోతున్నామంటున్నారు. నిద్ర కూడా పట్టక అనారోగ్యం పాలవుతున్నామని చెప్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్​కు వర్క్​ ఫ్రం హోం మొదలై ఏడాది దాటిపోయింది.

ఈ ఏడాదంతా కంటిన్యూ..!
హైదరాబాద్​లో చిన్నా పెద్ద ఐటీ కంపెనీలు కలిపి పదిహేను వందలు ఉంటాయి. వీటిలో ఆరు లక్షల మంది పని చేస్తుంటారు. మల్టీ నేషనల్​ కంపెనీలతో పాటు దేశీయ స్థాయిలో చిన్నా పెద్ద కంపెనీల్లో వందల నుంచి వేలాది మంది పని చేస్తుంటారు. విశాలమైన ఆఫీసులు, అట్రాక్టివ్​ వర్క్​ ఎన్విరాన్​మెంట్​, క్యాంటీన్లు, కెఫెటేరియాలతో ఐటీ ఉద్యోగుల లైఫ్​ సందడిగా గడిచేది. కరోనా, లాక్​డౌన్‌లతో  అందరూ ఇంటి నుంచి పని చేయాల్సి వచ్చింది. అన్​లాక్​లో భాగంగా నాన్​ ఐటీ సెక్టార్​లో ఆఫీసులు తెరుచుకున్నా, ఐటీలో మాత్రం వర్క్​ ఫ్రమ్​ హోం కొనసాగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో కొన్ని చిన్న కంపెనీలు ఆఫీసులు తెరిచాయి. కొంచెం పెద్ద కంపెనీలు మార్చి తర్వాత తెరుద్దామని అనుకున్నాయి. కాకపోతే ఎమ్మెన్సీలు మినహా కంపెనీలన్నీ ఫిబ్రవరి నాటికి 10%​, మార్చి నాటికి 15%​ స్టాఫ్​ను  ఆఫీసులకు పిలిచాయి. వ్యాక్సిన్​ ఎలాగూ వచ్చిందని ఏప్రిల్​లో దీన్ని 25- నుంచి 30 శాతానికి పెంచాలని అనుకున్నాయి. కానీ ఇప్పుడు కరోనా సెకండ్​ వేవ్​ని చూసి రిస్క్​ ఎందుకని ముందుగానే వర్క్​ ఫ్రమ్​ హోం కంటిన్యూ చేయాలని ఉద్యోగులకు సమాచారమిస్తున్నాయి. 

అనేక ఆరోగ్య సమస్యలు
నెలల తరబడి ఇంటి నుంచే పని చేయడం, పొద్దస్తమానం పనిలోనే ఉండాల్సి రావడంతో ఐటీ ఉద్యోగులు అనారోగ్యం బారినపడుతున్నారు. మెంటల్​ స్ట్రెస్​కు గురవుతున్నారు. ఆఫీసులో వర్క్​ అయితే పర్టిక్యులర్​గా టైమింగ్స్​ ఉంటాయి. లంచ్​ అవర్​, టీ బ్రేక్​ అని కొంత డైవర్షన్​ ఉంటుంది. వర్క్​ ఫ్రం హోం వల్ల  పొద్దున్నుంచి రాత్రి పది, పదకొండు వరకు పని చేయాల్సి వస్తోందని,  శనివారం కూడా పనిలో ఉండాల్సి వస్తోందని ఎంప్లాయీస్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకచోట గంటల తరబడి కూర్చొని పని చేయడం వల్ల బ్యాక్​ పెయిన్​, ఇరిటేషన్​, డ్రై ఐస్​, ఒబేసిటీ, ఇన్సోమ్నియా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. వర్క్​ ఫ్రమ్​ హోం వల్ల వచ్చే ఇబ్బందులతో తమను చాలా మంది ఐటీ ఉద్యోగులు కలుస్తున్నారని సైక్రియాటిస్టులు చెప్తున్నారు. కొన్ని రిలాక్సేషన్​  టెక్నిక్​లు చెప్పి వాళ్లకు కౌన్సెలింగ్​ చేస్తున్నామని అంటున్నారు. 
 
సఫర్​ అవుతున్నరు
వర్క్ ఫ్రం హోమ్ తో విసిగిపోయి చీటికి మాటికి చిరాకు వస్తుందని చాలామంది ఐటీ ఎంప్లాయీస్ కాల్స్ చేస్తున్నారు. ఆఫీసులో కంఫర్ట్ ఉంటుంది. వర్క్​ ఫ్రం హోంలోఒకే పొజిషన్​లో కూర్చొని అదే పనిగా స్క్రీన్​ చూడడం వల్ల కండ్లపై ఎఫెక్ట్​ పడుతోంది. దాంతో తలనొప్పి వస్తుంది. కంటి చూపు సమస్య కూడా ఎదుర్కొంటారు. ప్రతి రెండు గంటలకు ఓ అరగంట బ్రేక్​ తీసుకోవడం మంచిది.
– డాక్టర్​ హరిణి, సైక్రియాట్రిస్ట్, కేర్ హాస్పిటల్

పని గంటలు ఎక్కువ
ఏడాది నుంచి వర్క్ ఫ్రం చేస్తున్న. ప్రాజెక్టు కోసం ఎక్కువ అవర్స్​ పనిచేయడం వల్ల బాగా తలనొప్పి వచ్చి ఇబ్బంది పడ్డా. ఆఫీసులు ఎంత జెల్దీ తెరిస్తే అంత బెటర్​ అని ఎదురుచూస్తున్నా. కానీ కరోనా సెకండ్​ వేవ్‌తో మళ్లీ వర్క్ ఫ్రం హోం తప్పట్లేదు. 
- వనజ, ప్రాజెక్ట్ అసోసియేట్

హెల్త్​ ఇష్యూస్​ పెరిగినయ్​
కరోనా కేసులను బట్టి మా వర్క్​ ఫ్రమ్​ హోం ఎక్స్​టెండ్​ చేస్తూ వస్తున్నారు. పరిస్థితి చూస్తే ఈ ఇయర్​ ఎండ్​ వరకు ఎక్స్​టెండ్​ చేసేలా కనిపిస్తోంది.  ఇప్పటికే బ్యాక్ పెయిన్ లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి.
-రవి, కాగ్నిజెంట్​ సొల్యూషన్స్​

స్ట్రెస్​కు గురవుతున్నరు
వర్క్​ ఫ్రమ్​ హోంతో ఐటీ ఎంప్లాయీస్​ స్ట్రెస్​కు గురవుతున్నారు. తమ ప్రాబ్లమ్స్​ చెప్పుకునేందుకు డాక్టర్ల దగ్గరికి వస్తున్నారు. బ్యాక్​ పెయిన్​, తలనొప్పి  లాంటి సమస్యలతో బాధపడుతున్నారు.
- సందీప్​ రెడ్డి, జనరల్​ ఫిజీషియన్​, సన్​షైన్​