ఫేక్​ బిల్లుల దందా రూ.2కోట్లకు పైనే?

ఫేక్​ బిల్లుల దందా రూ.2కోట్లకు పైనే?
  • ఫేక్​ బిల్లుల దందా రూ.2కోట్లకు పైనే?
  • సీఎంఆర్​ఎఫ్​ నిధులు కొట్టివేసే కుట్రలో ఇద్దరు సూత్రధారులు
  • హాస్పిటల్స్​ ఓనర్లతో కలిసి వ్యవహారం
  • ఓ ముఖ్యనేత పీఏ సహకారం?
  • ఆఫీసర్ల మొక్కుబడి తనిఖీలతో దందా కంటిన్యూ

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా పాలకీడు మండలం  చెర్వు తండా గ్రామ పంచాయతీకి  చెందిన ఇద్దరు వ్యక్తులు  సీఎంఆర్ఎఫ్​(చీఫ్​ మినిస్టర్​ రిలీఫ్​ ఫండ్​) నుంచి  నిధులు  కొట్టేయడానికి ఫేక్​ బిల్లుల దందాకు  తెరతీసినట్లు తెలిసింది.  కొన్నేళ్లుగా ఈ ఫేక్​ బిల్లుల దందాను సాగిస్తుండగా ఎట్టకేలకు సీసీఎస్​(సెంట్రల్​ క్రైం స్టేషన్​)లో కేసు నమోదుతో  ఈ బాగోతం బయటపడింది. పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి మండలాలకు చెందిన సుమారు 200 నుంచి 250 మంది పేరి ట సదరు ఇద్దరు సూత్రధారులు ..  ఫేక్​ బిల్లులను తయారు చేసి సుమారు రూ. 2 కోట్లకుపైగా ఫ్రాడ్​ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 తెలంగాణ మల్టీ స్పెషాలిటీ,   కోణార్క్, సూర్యతేజ హాస్పిటల్స్​ ఈ ఫేక్​ బిల్లుల వ్యవహారంలో  సీజ్​ కాగా అప్పటి వాటి ఓనర్లే నిర్వహిస్తున్న మహేశ్​​ మల్టీ స్పెషాలిటీ లో   సీఎంఆర్​ఎఫ్  ఫేక్​ ​ బిల్లుల దందా  తెరపైకి వచ్చింది. 70 నుంచి 80శాతం ఫేక్​ బిల్లులను ఈ హాస్పిటల్స్​ ఓనర్ల సహకారంతోనే సదరు ఇద్దరు సూత్రధారులు పొంది.. సీఎంఆర్​ఎఫ్​ పైసలను కాజేసినట్లు తెలుస్తోంది. ప్రతీ బిల్లులో రూ. 20వేల  నుంచి 30 వేలు హాస్పిటల్​ ఓనర్స్​ వాటాగా తీసుకుంటూ .. దందాను కంటిన్యూ  చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మొత్తం దందా వెనుక ఉమ్మడి  నల్గొండ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత  పీఏ సహకారం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

పేరు మార్చి దందా..

పేదలకు వరంగా మారిన సీఎంఆర్​ఎఫ్​(ఎల్​ఓసీ) స్కీంలో ఫేక్​ మెడికల్​ బిల్లుల వ్యవహారం మాయని మచ్చగా మిగిలింది.  ఫేక్​ బిల్లుల దం దాలో  ఓ   సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి   చెల్లెలు  పేరు .. భూక్య జ్యోతి కాగా ఆమె పేరును బానావత్ జ్యోతిగా మార్చటం, ఫొటోను మాత్రం కుమార్తెది  పెట్టి బిల్లులు కాజే సిన విషయం  వెలుగులోకి రావటం హాట్​ టాపిక్​ గా మారింది. కాగా  ప్రైవేట్​ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్​లో  నిర్వహించాల్సిన  ఇన్​ పేషెంట్స్, ఔట్​ పేషెంట్స్​, ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్  డిటైల్స్​, బయో మెడికల్ వేస్ట్​ మేనేజ్​మెంట్​ రిజిస్టర్​ సహా ఇతర రిజిస్టర్లను  డీఎంవో స్థాయి ఆఫీసర్ చెక్​ చేయా ల్సి ఉంటుంది. అయితే మిర్యాలగూడ డాక్టర్స్​ కాలనీలో మొక్కుబడి చెకింగ్​లు చేస్తుండడంతో అక్రమార్కులకు అదనుగా మారి  ఫేక్​ బిల్లుల దందా జోరుగా నడిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

విచారణ​ స్పీడప్​..

ఫేక్​ మెడికల్​ బిల్లుల దందా వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు  మెడికల్​ ఆఫీసర్లు, సీఎంఆర్​ఎఫ్​ ఆఫీసర్లు విచారణ స్పీడప్​ చేస్తున్నారు. ఈ నెల 10న డీఎంహెచ్​వో, సంబంధిత ఆఫీసర్లు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​ను తనిఖీ చేయనున్నారని లోకల్​ ఆఫీసర్లు చెప్పారు.