పొంగులేటి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ రైడ్స్

పొంగులేటి ఇళ్లు, ఆఫీసులపై  ఐటీ రైడ్స్

పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై  ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.  8 వాహనాల్లో వచ్చిన అధికారులు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌,  ఖమ్మంలోని ఆయన ఇళ్లు, ఆఫీసులపై  ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.  పొంగులేటి సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

తనపై ఐటీ రైడ్స్ జరగవచ్చునని నిన్న పొంగులేటి కామెంట్ చేయగా ఈ రోజు తెల్లవారుజామునే అధికారులు రైడ్స్ చేయడం గమనార్హం.   పొంగులేటి ఇళ్లు, ఆఫీసులపై  ఐటీ రైడ్స్ జరుగుతుండటంతో ఆయన అనుచరులు మద్దతుగా పొంగులేటి ఇంటికి చేరుకుంటున్నారు.  కాగా పాలేరు  కాంగ్రెస్ అభ్యర్ధిగా పొంగులేటి ఇవాళ నామినేషన్ వేయనున్నారు.  

మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇండ్లల్లో బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు సోదాలు జరిపారు. ఖమ్మం రూరల్​ మండలం శ్రీసిటీ, అర్బన్​లోని గొల్లగూడెంలో గల తుమ్మల నివాసాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీ విజిల్ యాప్ లో అందిన ఫిర్యాదు మేరకే తనిఖీలు చేశామని వారు తెలిపారు.