బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ అధిష్టానం ఆరా

బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ అధిష్టానం ఆరా

తెలంగాణలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేంద్రం ఎప్పటికప్పుడూ ఆరా తీస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ పై ఆ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విధానంపై బీజేపీ అగ్ర నాయకులు, కేంద్ర మంత్రులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావుకు ఫోన్ చేసి...పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ కూడా పార్టీ నేతలతో మాట్లాడి.. ఎప్పటికప్పుడూ వివరాలు తెలుసుకుంటున్నారు. 

బండి సంజయ్ అరెస్ట్ గురించి జేపీ నడ్డా.. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు కూడా వివరించారని తెలుస్తోంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమిత్ షాను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారని బీజేపీ నాయకుల ద్వారా సమాచారం అందుతోంది. ఇటు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ.. తమ నిరసనలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.