
బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ప్రముఖ యూట్యూబర్ రాజ్ షమాని "ఫిగరింగ్ అవుట్" పాడ్క్యాస్ట్లో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా చాలా విషయాలపై స్పందించారు. బ్యాంకుల్లో తాను చేసిన అప్పులు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఫెయిల్యూర్, భారత్ లో వ్యాపారంపై రాజకీయ జోక్యం, సీఎంలతో సంబంధాలు, ఎన్నికలకు నిధులు ఇలా అనేక విషయాలపై విజయ్ మాల్యా తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.
మొదట కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వైఫల్యంపై పాడ్ కాస్ట్ లో మాట్లాడిన విజయ్ మాల్యా.. భారత్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఓ అపోహ అని అన్నారు. భారత్ లో వ్యాపారం బ్యూరోక్రాటిక్, రాజకీయ జోక్యంతో ప్రభావితం అయిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది కేవలం ఒక అపోహ.. కేంద్రం, లేదా రాష్ట్రం ఏం చెప్పినా.. బ్యూరోక్రాటిక్, రాజకీయ అడ్డంకులు చాలా ఉంటాయన్నారు.
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిందన్నారు విజయ్ మాల్యా. బ్యాంకులు తన సెటిల్మెంట్ ఆఫర్లను తిరస్కరించాయని చెప్పారు. తాను దేశం నుంచి పారిపోలేదని, ముందే నిర్ణయించిన పర్యటన కోసం వెళ్ళానని చెప్పారు. తిరిగి రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని మాల్యా వివరించారు. తాను పరారీలో మాత్రమే ఉన్నానని "దొంగను మాత్రం కాదని విజయ్ మాల్యా స్పష్టం చేశారు.
మద్యం వ్యాపారంపై స్పందించిన విజయ్ మాల్యా.. ఈ వ్యాపారం నిర్వహించాలంటే 29 రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలి.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మద్యం విధానం ఉంటుంది. ఆయా రాష్ట్రాల సీఎంలతో మంచి సంబంధాలు కలిగి ఉండాల్సి ఉంటున్నారు.
ఇక ఎన్నికల నిధుల విషయంలో మాట్లాడిన విజయ్ మాల్యా.. రాజకీయ పార్టీల తీరును విమర్శించారు. ఎన్నికల సమయంలో లిక్కర్ ఇండస్ట్రీనుంచి ప్రచారానికి నిధులు డిమాండ్ చేశారని మాల్యా అన్నారు. కొన్నికొన్ని సార్టు వారి డిమాండ్లు అసాధారణమైనవిగా, అసంజమసంగా ఉండేవని అన్నారు. ఇక వారినుంచి తప్పించుకునేందుకు దేశం విడిచివేళ్లేవాడినని మాల్యా చెప్పారు.
భారత్ లో లంచం పై కూడా విజయ్ మాల్యా స్పందించారు. మాల్యాను లంచం గురించి అడిగినప్పుడు ఎవాసివ్ గా సమాధానం చెప్పారు. భారత్ లో లంచం గురించి ఖండించలేను అని అన్నారు.
తనకు జరిగిన అన్యాయంపై ఇలా స్పందించారు. బ్యాంకులకు తాను ఉన్న అప్పులు, చెల్లించిన మొత్తం విషయంలో తనకు అన్యాయం జరిగిందని విజయ్ మాల్యా అన్నారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) తీర్పు ప్రకారం తాను బ్యాంకులకు చెల్లించాల్సింది రూ. 6,203 కోట్లు అని మాల్యా చెప్పారు. అయితే బ్యాంకులు తన నుంచి రూ.14,131.6 కోట్లకు పైగా రికవరీ చేశాయని..ఇది తాను తీసుకున్న రుణానికి దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని వాదించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా ఈ విషయాన్ని ధృవీకరించిందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఒకవేళ తాను బ్యాంకులను మోసం చేసి ఉంటే, ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా రికవరీ చేసిందని మాల్యా ప్రశ్నిస్తున్నారు. ఇది తాను "దొంగ" కాదన్నదానికి నిదర్శనం అని మాల్యా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.