ట్రంప్ ఓటమి నుంచి ఇండియా నేర్చుకోవాలి

ట్రంప్ ఓటమి నుంచి ఇండియా నేర్చుకోవాలి

ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ చేతిలో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలపై శివ సేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో స్పందించింది. ట్రంప్ ఓటమి నుంచి భారత్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని సామ్నా పేర్కొంది. యూఎస్ ఎలక్షన్ రిజల్ట్‌‌ను బీహార్ ఎన్నికల ఫలితాలతో పోల్చుతూ పలు వ్యాఖ్యలు చేసింది.

‘ప్రెసిడెంట్‌‌ హోదాకు తగ్గట్లుగా ట్రంప్ ఎప్పుడూ వ్యవహరించలేదు. ట్రంప్ విషయంలో తమ తప్పును గుర్తించిన అమెరికా ప్రజలు.. నాలుగేళ్లలోనే దాన్ని సరిదిద్దుకున్నారు. తన వాగ్దానాల్లో ఒక్కదాన్ని కూడా ట్రంప్ నెరవేర్చలేదు. ట్రంప్ ఓటమి నుంచి మనం నేర్చుకుంటే మంచింది. అమెరికాలో అధికారం మారింది. బీహార్‌‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ఓటమికి దగ్గరలో ఉంది. దేశంలో యూపీఏను మించి మరో ప్రత్యామ్నాయం లేదు’ అని సామ్నాలో శివ సేన పేర్కొంది.