సంక్షేమం, విద్యాభివృద్ధికి కృషి : ఐటీడీఏ పీవో బి.రాహుల్

సంక్షేమం, విద్యాభివృద్ధికి కృషి : ఐటీడీఏ పీవో బి.రాహుల్
  •     ఐటీడీఏ పీవో బి.రాహుల్​

భద్రాచలం, వెలుగు :  గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ఐటీడీఏ యాక్షన్​ప్లాన్​ అమలు చేస్తోందని పీవో బి.రాహుల్​ పేర్కొన్నారు. ఇండియా హౌస్​ టీం శనివారం భద్రాచలంలో పర్యటించి ట్రైబల్ మ్యూజియం, బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన అనంతరం పీవోతో బేటీ అయ్యింది. 

ఈ సందర్భంగా పీవో వారికి ఐటీడీఏ చేపడుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. విద్య,వైద్యం , గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, కొండరెడ్ల సంక్షేమం, గిరిజన యువతీ, యువకుల్లో స్కిల్స్ పెంచడం, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి కార్యక్రమాలతో డెవలప్​ చేస్తున్నట్లు వివరించారు. 

ప్రధానంగా వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లుగా తెలిపారు. గిరిజన మహిళలు తయారు చేసిన మిల్లెట్​ బిస్కెట్లు లండన్ వరకు వెళ్లడం, ప్రధాని మోదీని మెప్పించడం లాంటి అంశాలు వారి జీవనోపాధికి చేపట్టిన చర్యల్లో భాగమేనన్నారు. 

ఈ సందర్భంగా ఇండియా హౌస్​ ప్రతినిధులు జాహ్నవి, సోనాలి గాడ్గే, డిప్యూటీ కలెక్టర్​ మురళీ మాట్లాడుతూ ట్రైబల్​ మ్యూజియం ఎంతో బాగుందని ప్రశంసించారు. విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన వసతులు మెరుగ్గా ఉన్నాయని, విద్యావిధానం కూడా చక్కగా ఉందని పేర్కొన్నారు.