
'నాంది' మూవీ తరువాత హీరో అల్లరి నరేష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లతో ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. చిత్ర ట్రైలర్ ను నవంబర్ 11 న రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.
కొత్త దర్శకుడు ఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రాజేష్ దండ, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అల్లరి నరేశ్ గవర్నమెంట్ ఆఫీసర్గా కనిపిస్తు్ండగా, అతని సరసన ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. నవంబరు 25న ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.