V6 News

జాగృతి విద్యార్థులను అభినందించిన మాజీ మంత్రి

జాగృతి విద్యార్థులను అభినందించిన మాజీ మంత్రి

వనపర్తి, వెలుగు : ఇంటర్మీడియట్​ ఫలితాల్లో  తమ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో ప్రభంజనం సృష్టించారని ప్రిన్సిపాల్​ అంబటి వినోద్​కుమార్​ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో  బైపీసీలో   ఉజ్మా హజారా  438 మార్కులతో 2వ ర్యాంకును, అదే విధంగా   బైపీసీలో  హెచ్​.అనుష్ణ 994  మార్కులతో ఉమ్మడిజిల్లా 1వ ర్యాంకును సాధించి మరొకసారి వనపర్తిలో ప్రతిభ చాటారని కాలేజీ ప్రిన్సిపాల్​ అంబటి వినోద్​కుమార్​ తెలిపారు.

మంగళవారం కాలేజీకి వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్టేట్ ర్యాంకర్లను  సన్మానించారు.  అదే విధంగా జేఈఈ మెయిన్స్​ -2026 ఫలితాల్లో  సీహెచ్​.అర్జున్ 91.69 పర్సంటైల్​ తో జిల్లాలో అగ్రగామిగా నిలిచాడని, జిల్లాలో ఇంటర్ తో పాటు జేఈఈ , నీట్​, ఈఏపీసెట్​ లలో కూడా కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా జాగృతి కాలేజీ నిలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. యజమాన్య సభ్యులు భాస్కర్, శ్యామ్ కుమార్ , సత్యనారాయణ లను ప్రత్యేకంగా అభినందించారు.