
జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈజీఎస్ పనుల బిల్లులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. అలాగే అంగన్వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన సీతక్క బిల్లుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.