పార్టీ సభ్యత్వం తీసుకుంటే.. రూ. 300లకు 2వందల గజాల భూమి..

పార్టీ సభ్యత్వం తీసుకుంటే..  రూ. 300లకు 2వందల గజాల భూమి..

18 ఏళ్లు నిండిన మహిళలు తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటే 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తామంటూ.. జై మహా భారత్ పార్టీ మోసం చేసిందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెంబర్ షిప్ పేరుతో రూ. 300 కట్టించుకొని మోసం చేశారని బాధితులు మండిపడ్డారు. పార్టీ మెంబర్ షిప్ తీసుకుంటే 200 గజాల భూమి, లక్ష రూపాయల లోన్ ఇస్తామని చెప్పారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. 

గత 3, 4 నెలల నుంచి ఆ పార్టీ ప్రతినిధులు తెలంగాణలో మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలిసి మహిళలు, నిరుపేదలు జై మహా భారత్ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి హైదరాబాద్ రవీంద్రభారతి సమీపంలోని రెడ్ హిల్స్ కు పెద్దఎత్తున్న తరలివచ్చారు.

ALSO READ : ఉద్యోగం సద్యోగం చేయదంట.. బిజినెస్సే చేస్తాదంట.. ఆకట్టుకుంటోన్న కుమారి శ్రీమతి టీజర్

అయితే తమకు భూమి ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణును మహిళలు నిలదీశారు. అధ్యక్షుడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తాము మోసపోయామని మండిపడ్డారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని దూరప్రాంతాల నుండి వచ్చామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.