నగల వ్యాపారి వెజిటబుల్స్ అమ్ముతుండు

నగల వ్యాపారి వెజిటబుల్స్ అమ్ముతుండు

జైపూర్: లాక్ డౌన్ తో చిరు వ్యాపారుల బతుకులు చితికిపోయాయి. బిజినెస్ లేక షాపుల అద్దెలు, ఫ్యామిలీని పోషించడం వారికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో జైపూర్ లోని ఓ నగల వ్యాపారి వెజిటబుల్స్ అమ్ముతున్నాడు. హుకుంచంద్ సోనీ జైపూర్ లోని రామ్ నగర్ లో 25 ఏళ్లుగా ఓ చిన్న జ్యువెలరీ షాపు నడుపుతున్నాడు. లాక్ డౌన్ తో షాపులను బంద్ చేయడంతో కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాడు. డబ్బులన్నీ అయిపోవడంతో కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

ప్రతిరోజూ మండీ నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చి తన షాపు దగ్గరే పెట్టుకొని అమ్ముతున్నాడు. ‘‘నాది చిన్న జ్యువెలరీ షాప్. నా దగ్గర పెద్దగా సేవింగ్స్ లేవు. లాక్ డౌన్ తో ఉన్న పైసలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్యామిలీని పోషించుకోవాలంటే నాకు ఇదొక్కటే దారి” అని వాపోయాడు హుకుంచంద్ సోనీ. కనీసం ఇప్పుడు ఎంతో కొంత సంపాదిస్తున్నానని, ఇంట్లో ఊరికే కూర్చొవడం కంటే ఇది నయం కదా అని చెబుతున్నాడు.