ఎస్టీపీపీకి ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు

ఎస్టీపీపీకి ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్స్ అవార్డు

జైపూర్, వెలుగు: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ మరో అవార్డు అందుకుంది. కౌన్సిల్ అఫ్ ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో శనివారం మహారాష్ట్రలోని నాగ్​పూర్​లో జరిగిన 4వ జాతీయ పవర్ జనరేషన్ ఎన్విరాన్మెంట్ ఎక్సలెన్స్ 2025 కార్యక్రమంలో ‘బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఎక్స లెన్స్ టీమ్ అఫ్ ది ఇయర్’ అవార్డును ఎస్టీపీపీ కైవసం చేసుకుంది. ఈ ఆవార్డును (సిస్టం అండ్ ఎఫీషియెన్సీ) డీజీఎం పి.వీరబ్రహ్మం, డైరెక్టర్​ ఎస్.వెంకట మోహన్ అందుకున్నారు.

 దీంతో ఎస్టీపీపీ అవార్డుల సంఖ్య 53కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ.. సింగరేణిలో చేపడుతున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందన్నారు. కాలుష్య నివారణ చర్యలు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అవార్డు దక్కడం పట్ల డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగులను అభినందించారు.