న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వీ జైశ్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన 7వ భారతీయ క్రికెటర్గా నిలిచాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ కొట్టడం ద్వారా జైశ్వాల్ ఈ రికార్డ్ నెలకొల్పాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో శతకాలు సాధించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరసన చేరాడు. 23 ఏళ్లలోనే వయస్సుల్లోనే జైశ్వాల్ ఈ ఘనత అందుకోవడం విశేషం.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమై విమర్శల పాలైన ఈ యువ క్రికెటర్ మూడో వన్డేలో అదరగొట్టాడు. శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 111 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 35 ఓవర్ రెండో బంతికి కార్బిన్ బాష్ బౌలింగ్లో సింగిల్ తీసుకొని తన వన్డే కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు.
తొలి రెండు వన్డేల్లో నిరాశపర్చినా సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో మాత్రం సెంచరీతో చెలరేగి టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో 2-1 తేడాతో ఇండియా సిరీస్ నెగ్గింది. సొంతగడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. 2025, డిసెంబర్ 9 నుంచి ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య 5 మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన ఇండియన్ బ్యాటర్స్:
1 సురేష్ రైనా
2 రోహిత్ శర్మ
3 కేఎల్ రాహుల్
4 విరాట్ కోహ్లీ
5 శుభమన్ గిల్
6 స్మృతి మంధాన( మహిళా క్రికెటర్)
7 యశస్వీ జైశ్వాల్
