
- నివేదిక వచ్చినంక కాంట్రాక్టర్పై చర్యలు: జలమండలి
హైదరాబాద్ సిటీ, వెలుగు: సుంకిశాల ప్రాజెక్ట్ గోడ కూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను జలమండలి ఖండించింది. ‘‘ఈ ఘటనపై మేం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. టెక్నికల్టీం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కూడా చెప్పింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా సుంకిశాల ఘటనపై విచారణ చేపట్టిం ది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఇచ్చే నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటాం” అని జలమండలి బుధవారం ప్రకటనలో పేర్కొంది. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు తాగునీళ్లు తరలించేందుకు ఇప్పటి వరకు అంచనాలు రూపొందించలేదని స్పష్టం చేసింది.