
జమ్మూ కశ్మీర్ ఉధంపూర్ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డూడు ప్రాంతంలో టిప్పర్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
ఆగస్టు 23వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే వాహనం కింద చిక్కుకుపోయి గాయపడిన వ్యక్తిని స్థానికులు రక్షించారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు.