కశ్మీర్ లో కొత్త రాజకీయ పార్టీ

కశ్మీర్ లో కొత్త రాజకీయ పార్టీ

శ్రీనగర్: ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన షా ఫైజల్ సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్‌‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆదివారం శ్రీనగర్ లోని రాజ్ బాగ్ లో జరిగిన కార్యక్రమంలో వందలాది అభిమానులు ముం దు ‘జమ్మూకశ్మీర్ పీపుల్స్ మూమెంట్(జేకేపీఎం)’ పేరును ప్రకటించారు షా ఫైజల్. కశ్మీర్ లోని యువతకు ఈ పార్టీ ఓ కొత్త వేదికగా ఉండబోతోందని ఆయన చెప్పారు. ‘ ‘స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యల పరిష్కారానికి జేకేపీఎం కృషి చేస్తుంది. జమ్మూకశ్మీర్ ను మతం ఆధారంగా విడదీసే శక్తులతో పోరాడతాం. యువతకు ప్రతినిధులుగా ఉంటాం ”అని షా ఫైజల్ అన్నారు. జేఎన్ యూకు చెందిన ప్రముఖ విద్యార్ థి నేత షేహ్లా రషీద్ షోరా కూడా జేకేపీఎంలో చేరడం విశేషం. కశ్మీరీలపై కొనసాగుతున్న హత్యలు, ముస్లింలపై అణచివేతను నిరసిస్తూ ఫైజల్ గత జనవరిలో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.