జనగామ అర్బన్, వెలుగు: చిన్ననీటి వనరుల సెన్సెస్ పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గణాంకాల సేకరణపై అధికారులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు.
అంతకుముందు నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి 94 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న కలెక్టరేట్ ఉద్యోగులందరికీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మెడికల్క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
