
జనగామ అర్బన్, వెలుగు: సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి సోమవారం జనగామ కలెక్టరేట్కు విచ్చేశారు. ఆయనకు కలెక్టర్ స్వాగతం పలికారు. ఇటీవల నాస్(నేషనల్ అభ్యసన సామర్థ్యం) ఫలితాల్లో దేశంలో ఎంపికైన 50 జిల్లాల్లో జనగామకి చోటు దక్కింది.
ఈ నేపథ్యంలో నాస్ పరీక్ష కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణను పాఠశాలల్లో ఎలా అమలు చేశారో పీపీటీ ద్వారా విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపల్సెక్రటరీకి వివరించారు. కలెక్టరేట్లో వివిధ విభాగాలు, చాంబర్లను ఎలా కేటాయించారో ఇతర అంశాలను కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంతు నాయక్, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.