క్రికెట్ థీమ్ చీరలో జాన్వీ కపూర్: ఈ ఫొటోస్ IPL కంటే యమ కిక్

క్రికెట్ థీమ్ చీరలో జాన్వీ కపూర్: ఈ ఫొటోస్ IPL కంటే యమ కిక్

బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న జాన్వీ  కపూర్ ఇప్పుడుప్పుడే తెలుగుతెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో చేసే దేవర సినిమా తెలుగులో మొదటిది. రామ్ చరణ్ తో మరో సినిమా చేయడానికి కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే. మూవీస్ తో బీజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది ఈ వయ్యారి. త్వరలో ఆమె నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మాహీ మూవీకి ప్రమోషన్ లో భాగంగా మే 21న క్రికెట్ థీమ్ సారీతో ఇండియా గేట్ లొకేషన్ లో మెరిసింది. 

ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది.  పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో ఉండే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్, రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్నారు. మే 31న ఈ సినిమా విడుదల కానున్నంది. ఈక్రమంలో జాన్వీ, రాజ్ కుమార్ ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇండియా గేట్ దగ్గర ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ లో జాన్వీ సారీ, బ్యాగ్ క్రికెట్ బాల్ థీమ్ లో  ఉంది. మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉన్న ఆ చీరపై క్రికెట్ బాల్స్ డిజైన్ చేసి ఉన్నాయి.