జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో పొగలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం జరిగింది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్ లోని  జనరల్ బోగిలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ట్రైన్ లో  పొగలు వచ్చాయన్న సమాచారంతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ లో రైలును ఆపేశారు అధికారులు. రైలు ఆగిన వెంటనే ప్రయాణికులంతా దిగి పరుగులు తీశారు. 

ఏలూరు రైల్వే స్టేషన్ లోనే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు.. అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఏలూరులో అరగంట పాటు రైలును నిలిపివేశారు. అక్కడ పోగలు రాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.  అనంతరం రైలు వైజాగ్ బయలుదేరింది. కానీ మళ్లీ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కు రైలు చేరుకోగానే మరో రెండు భోగిల్లోనూ పొగలు వచ్చాయి. దీంతో మళ్లీ తాడేపల్లిగూడెం దగ్గర ట్రైన్ ని ఆపేశారు. పొగలను అదుపు చేసిన రైల్వే సిబ్బంది... బ్రేకులు పట్టేయడంతో పొగలు వ్యాపించాయని చెప్పారు.