
జన్నారం, వెలుగు: జన్నారం మండల కేంద్రంలోని కృష్ణవేణి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ కస్తూరి సతీశ్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్అవార్డు అందుకున్నారు. అమెరికాలోని స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్శిటీ, జీఎస్ హెచ్ఏ అకాడమీ సంయుక్తంగా హైదరాబాద్ లోని సూర్యలోక్ కాంప్లెక్స్ లో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థల చైర్మన్ ఏంవీ ప్రసాద్, సామాజిక కార్యకర్త పృథ్వీరాజ్ నుంచి సతీశ్ ఈ అవార్డును అందుకున్నారు. విద్యారంగంలో సతీశ్ చేస్తున్న విశిష్ట సేవలకు గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వహకులు తెలిపారు.