న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ త్రోయర్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మరో కలను సాకారం చేసుకున్నాడు. తన తల్లిదండ్రులను విమానంలో తీసుకెళ్లాలనుకున్న చిన్న నాటి కలను నెరవేర్చుకున్నాడు. కర్ణాటకలోని బల్లారీలో తన ప్రమోటర్ ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రామ్ కోసం స్పెషల్ ఫ్లైట్లో తన పేరెంట్స్ సతీశ్ కుమార్, సరోజ్ దేవితో కలిసి చోప్రా ప్రయాణించాడు. ‘మా పేరెంట్స్ను ఫ్లైట్లో తీసుకెళ్లాలన్న ఓ చిన్న కల ఈ రోజు సాకారమైంది’ అని చోప్రా ట్వీట్ చేశాడు. చోప్రా పేరెంట్స్తో పాటు కోచ్, జర్మన్ బయో మెకానిక్స్ ఎక్స్పర్ట్ బర్టోనియెట్జ్, ఒలింపిక్ సూపర్ హెవీ వెయిట్ బాక్సర్ సతీశ్ కుమార్ కూడా ఇందులో ప్రయాణించారు.
A small dream of mine came true today as I was able to take my parents on their first flight.
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 11, 2021
आज जिंदगी का एक सपना पूरा हुआ जब अपने मां - पापा को पहली बार फ्लाइट पर बैठा पाया। सभी की दुआ और आशिर्वाद के लिए हमेशा आभारी रहूंगा ?? pic.twitter.com/Kmn5iRhvUf