- పేట్బషీరాబాద్, నిజాంపేట గ్రేటర్లో ప్రాంతాలు కాదు..
- ‘జవహర్లాల్సొసైటీ’ భూములను రీ సర్వే చేయాలి
- సొసైటీ మెంబర్స్ డిమాండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు పేట్బషీరాబాద్, నిజాంపేటలో ఇచ్చిన భూములను రీ సర్వే చేయించాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సొసైటీ సభ్యులు మాట్లాడారు. భూముల కోసం ప్రభుత్వానికి రూ.12 కోట్ల 33 లక్షలు చెల్లించామని, ఐఅండ్పీఆర్ ద్వారా నిజాంపేటలో 32 ఎకరాలు, పేట్బషీర్బాగ్లో 38 ఎకరాలు కేటాయించారన్నారు. సుప్రీంకోర్టు 2022లో 2010లో హైకోర్టు ఆర్డర్ కాపీని పరిగణలోకి తీసుకుని తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు.
గతేడాది రవీంద్రభారతిలో కాంగ్రెస్ సర్కారు పట్టాలు కూడా అందజేసిందన్నారు. అయితే, 2024లో సుప్రీం కోర్టు మళ్లీ గ్రేటర్ పరిధిలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడాన్ని తప్పు పట్టిందన్నారు. దీంతో ప్రభుత్వం మళ్లీ వెనకడుగు వేసిందన్నారు. ఈ తీర్పు తమకు కేటాయించిన భూములకు వర్తించదన్నారు. తమకు కేటాయించినప్పుడు ఆ భూములు జిల్లా, పంచాయతీ ఆధీనంలో ఉన్నాయని, ఇప్పటికీ జిల్లా, మున్సిపల్శాఖ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. కేటాయించిన భూములను కొందరు అక్రమార్కులను కబ్జా చేశారన్నారు. అధికారులు భూమిని రీ సర్వే చేసి, సొసైటీ సభ్యులకు భూమి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సొసైటీ మెంబర్స్శివకుమార్ రెడ్డి, మంజుల, షరీఫ్, శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
