జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ విడుద‌ల‌

జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ విడుద‌ల‌
  • జూలై 3న అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌
  • అదే నెల 18న ఫ‌లితాలు
  • 21న ఆర్కిటెక్చ‌ర్ ఆప్డిట్యూట్ టెస్ట్‌
  • ఏప్రిల్‌,మే నెల‌ల్లో మెయిన్స్ ఉండే అవ‌కాశం

దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)ల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ను జూలై 3న నిర్వ‌హిస్తారు. ఆ ప‌రీక్షా ఫ‌లితాల‌ను అదే నెల 18న విడుద‌ల చేస్తారు. ఆ త‌ర్వాత అదే నెల 21న అర్కిటెక్చ‌ర్ ఆప్డిట్యూట్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ను ఏప్రిల్‌, మే నెల‌ల్లో నిర్వ‌హించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.