సెప్టెంబర్లో జరగనున్న JEE,NEET పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనికి సంబంధించి ఇవాళ(సోమవారం) న్యాయమూర్తులు పిటిషన్ను కొట్టివేశారు. పరీక్షలను వాయిదా వేయడంతో విద్యార్థులు నష్టపోతారని సుప్రీం వ్యాఖ్యానించింది. ఒక ఏడాదిపాటు అకాడమిక్ ఇయర్ను వారు కోల్పోతారని, అందువల్ల అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని, కనుక పరీక్షలను వాయిదా వేయలేమని కోర్టు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు JEE మెయిన్స్ ను ఆన్లైన్ మోడ్లో, సెప్టెంబర్ 13న నీట్ను ఆఫ్లైన్ మోడ్లో దేశవ్యాప్తంగా ఉన్న 161 సెంటర్లలో నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. వారి తరఫున లాయర్ అలఖ్ అలోక్ శ్రీవాత్సవ కోర్టులో వాదనలు వినిపించారు. కరోనా ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. అయితే ఇందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూ సోమవారం వారి పిటిషన్ను కొట్టి వేసింది. దీంతో వచ్చే నెలలో యథావిధిగా ఆయా పరీక్షలు జరగనున్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ త్వరలో వస్తుందని..మన ప్రధాని మోడీ తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలిపారని, అందువల్ల అప్పటి వరకైనా పరీక్షలను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనంలోని జడ్జి అరుణ్ మిశ్రా స్పందిస్తూ, కోవిడ్ ఉన్నప్పటికీ జాగ్రత్తలను తీసుకుంటూ పరీక్షలను నిర్వహిస్తారని, ఇంకా ఆలస్యం చేస్తే విద్యార్థుల భవిష్యత్తుపై పరీక్షలు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని తెలుపుతూ .. అందువల్ల పరీక్షలను వాయిదా వేయడం కుదరని స్పష్టం చేశారు.
JEE,NEET పరీక్షలను వాయిదా వేయలేం: సుప్రీం కోర్టు
- దేశం
- August 17, 2020
లేటెస్ట్
- ఏంటీ కిరాతకం : పట్టపగలు.. నడి రోడ్డుపై వ్యాపారిపై కాల్పులు
- రణరంగం : పోలీస్ స్టేషన్ లో భార్యభర్తలు మృతి.. స్టేషన్ తగలబెట్టిన గ్రామస్తులు
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Vishwanetha: తెరపైకి మోదీ బయోపిక్.. విశ్వనేతగా కట్టప్ప
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- తక్కువ ధరకే ఫ్లాట్స్ .. జనానికి రూ.60 కోట్లు టోకరా
- V6 DIGITAL 18.05.2024 AFTERNOON EDITION
- Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం..ఆ జాబితాలో తొలి భారతీయ నటిగా గుర్తింపు
- T20 World Cup 2024: టీమిండియాతో పాటు ఆ మూడు జట్లు సెమీస్కు చేరతాయి: జైషా
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు