జీప్ ఇండియా మెరిడియన్ ఎక్స్, అప్ల్యాండ్ ఎస్యూవీల స్పెషల్ ఎడిషన్స్ను లాంచ్ చేసింది. ధరలు ధర రూ.33.41 లక్షల నుంచి రూ.38.47 లక్షల వరకు ఉంటాయి. సాహసాన్ని ఇష్టపడే కస్టమర్ల కోసం వీటిని డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది. రూఫ్ క్యారియర్ సైడ్ స్టెప్స్, స్ప్లాష్ గార్డ్లు, బూట్ ఆర్గనైజర్, సన్షేడ్స్, కార్గో మ్యాట్స్, టైర్ ఇన్ఫ్లేటర్, ప్రత్యేక హుడ్ డెకాల్ వంటి ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. రెండు బండ్లలో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ను అమర్చారు. 0--1–00 కిలోమీటర్ల వేగాన్ని ఇవి 10.8 సెకన్లలో అందుకుంటాయి. టాప్ స్పీడ్ 198 కిలోమీటర్లు. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
