శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సొపొర్ ఏరియాలో సెక్యూరిటీ ఫోర్స్తో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ గ్రూప్ కమాండర్ బుధవారం చనిపోయాడు. మృతుడిని సాజద్ నవాబ్ దార్ గా గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. మిలిటెంట్లు ఉన్నారన్న పక్కా సమాచారంతో సొపొర్ లోని ఆరంపొర ఏరియాలో పోలీసులు మంగళవారం రాత్రి కార్డన్ సెర్చ్ జరిపారు.
టెర్రరిస్టులు ఆ ప్రాంతం నుంచి పారిపోకుండా పకడ్బందిగా సెర్చ్ను కొనసాగించారు. తప్పించుకునే ప్రయత్నంలో సెక్యూరిటీ ఫోర్స్పై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో సెక్యూరిటీ ఫోర్స్ కాల్పులు జరపడంతో సాజద్ చనిపోయినట్టు చెప్పారు పోలీసులు.