
హైదరాబాద్, వెలుగు: తమ స్టోర్లో బ్రైడల్ జ్యూయలరీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని హైదరాబాద్కు చెందిన శ్రీ మహాలక్ష్మి జ్యూయలర్స్ అండ్ డైమండ్స్ ప్రకటించింది. ఇది మంగళవారం (జులై 01) ముగుస్తుందని తెలిపింది. పెళ్లిళ్లకు అవసరమైన నగలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. కొత్త దంపతులతో పాటు నగలను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ కార్యక్రమం సరికొత్త అనుభూతిని ఇస్తుందని సంస్థ తెలిపింది.
ఇక్కడ కుందన్, జడావు, మినాకారి నగలను ప్రదర్శనకు ఉంచారు. తమ కలెక్షన్లు అన్నీ బీఐఎస్ హాల్మార్క్ బంగారం, డబుల్ సర్టిఫైడ్ నేచురల్ డైమండ్స్తో అందుబాటులో ఉంటాయని, అందువల్ల ప్రతి నగ కూడా ఒక దీర్ఘకాలిక పెట్టుబడి అవుతుందని శ్రీ మహాలక్ష్మి జ్యూయలర్స్ తెలిపింది.