Jio 5G: మరో నాలుగు సిటీల్లో జియో 5జీ

Jio 5G: మరో నాలుగు సిటీల్లో జియో 5జీ

ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని ప్రతి పట్టణం, మండలం, గ్రామాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్రయత్నాలు చేస్ోతంది. ఇందుకు అవసరమైన పనులు వేగవంతం చేసినట్లు జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు నగరాల్లో 5జీ సేవల్ని అందిస్తున్న జియో ఇప్పుడు నిజామాబాద్, ఖమ్మంలో కూడా తన సేవల్ని ప్రారంభించిందని ప్రకటించారు.. 

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కర్నూల్‌లో కూడా జియో 5జీ సేవల్ని ప్రారంభించింది. దీంతో దేశంలోని 105  పట్టణాలు, నగరాలు జియో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. 100 రోజుల్లోనే 101 సిటీలకు 5జీ సేవలు అందించి జియో ఇప్పటికే రికార్డ్ నెలకొల్పింది. ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు కస్టమర్లు జియో 5జీ సర్వీసులు వాడుతున్నారు.