హైదరాబాద్, వెలుగు: సిలికాన్ వాలీ డీప్టెక్ స్టార్టప్ కంపెనీ టు ప్లాట్ఫామ్స్లో 25 శాతం వాటా కొంటున్నట్లు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ప్రకటించింది. ఇందుకోసం 15 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. శామ్సంగ్ టెక్నాలజీ మాజీ ప్రెసిడెంట్ ప్రణవ్ మిస్త్రీ ఈ టు ప్లాట్ఫామ్స్ కంపెనీని నెలకొల్పారు. ఆర్టిఫిషియల్ రియాలిటీ రంగంలో టు ప్లాట్ఫామ్స్ పనిచేస్తోంది. ఏఐ, ఎంఎల్, ఏఆర్, మెటావర్స్, వెబ్3.0 ఏరియాలలో టు ప్లాట్ఫామ్స్ పనితీరు అద్భుతంగా ఉండటంతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ చెప్పారు. టెక్స్ట్, వాయిస్ తర్వాత విజువల్అండ్ ఇంటరాక్టివ్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యం పెరుగుతుందని టు ప్లాట్ఫామ్స్ అంచనా వేస్తోంది. మొదట కన్జూమర్ అప్లికేషన్స్ కోసం, ఆ తర్వాత ఎంటర్టెయిన్మెంట్, గేమింగ్ కోసం ఏఐ టెక్నాలజీలను తేనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇండియా డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్లో జియో కీలకపాత్ర పోషిస్తుండటంతో భాగస్వామ్యంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నట్లు మిస్త్రీ చెప్పారు.