పండుగ ఆఫర్: రూ.1500ల Jio ఫోన్ రూ.699కే..!

పండుగ ఆఫర్: రూ.1500ల Jio ఫోన్ రూ.699కే..!

దసరా, దీపావళి పండుగల సందర్భంగా jio కంపెనీ రూ.1500 ధర ఉన్న ఫోన్ ను రూ.699 రూపాయలకే ఇవ్వనుంది. ఇందుకు గాను మంగళవారం ప్రకటన విడుదల చేసింది. దేశంలో ఉన్న కింది స్థాయి వాళ్లకు కూడా ఇంటర్నేట్ సౌకర్యం కల్పించాలన్న ఉద్ధేశంతోనే ఈ ఆఫర్ ను ప్రకటించామని తెలిపింది. దేశంలో 35కోట్ల మంది 2G వినియోగదారులు ఉన్నారని వాళ్లందరినీ 4G వైపు మళ్లించేందుకు చూస్తున్నామని చెప్పింది. ఇప్పుడు ప్రకటించిన ఆఫర్ ను సొంతం చేసుకుంటే 700ల రూపాయల విలువైన డేటాను అందించనున్నట్లు తెలిపింది.