ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) జియో ఇన్ఫోకామ్ మ్యూచువల్ ఫండ్స్, ఇతర ఫైనాన్షియల్ సెగ్మెంట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సేవలను కొత్త ఏడాదిలో ప్రారంభించేందుకు కంపెనీ ప్లాన్లు రెడీ చేస్తోంది. రిలయన్స్ జియో డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ జియో మనీ ద్వారా మ్యూచువల్ ఫండ్ సేవలను అందించనుంది. జియో మనీ ద్వారా నగదును పంపడానికి, తీసుకోవడానికి, డొనేట్ చేయడానికి వీలవుతుంది. వీటితో పాటు బిల్స్ పే చేయడం, మొబైల్ ఫోన్లను, డీటీహెచ్లను రీచార్జ్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ సర్వీసులను ప్రారంభించడంపై గత కొన్ని నెలల నుంచి జియో ట్రయల్స్ నిర్వహిస్తోందని పరిశీలకులు తెలిపారు. దీనిపై రిలయన్స్ జియో మీడియా ప్రతినిధి స్పందించలేదు. గత కొన్ని క్వార్టర్ల నుంచి ఉద్యోగులకు ఈ సేవలను కంపెనీ అందిస్తోందని రిలయన్స్ జియో అధికారి ఒకరు తెలిపారు. దీని వలన ఈ సేవలను ప్రారంభించక ముందే లూప్ హోల్స్ను తెలుసుకోవడానికి, నెట్వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టెస్ట్ చేయడానికి కంపెనీకి వీలవుతుందన్నారు. జియోతో అధికారికంగా ఎటువంటి చర్చలు జరగకపోయినప్పటికి, కంపెనీ ఆర్బీఐ నుంచి అకౌంట్ అగ్రిగేటర్(ఏఏ) లైసెన్సును జియో ఇన్ఫోకామ్ ద్వారా పొందిందని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. బ్యాంక్ అకౌంట్,క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వంటి వివరాలను కస్టమర్ల అంగీకారంతో సేకరించేందుకు ఏఏ అనుమతిస్తుంది. జియో మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్లో కి అడుగుపెడుతుండడం, ఈ రంగానికి లాభిస్తుందని విశ్లేషకులు తెలిపారు.
త్వరలో జియో మ్యూచువల్ ఫండ్స్
- బిజినెస్
- January 3, 2020
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో