వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ .. సీపీ సీవీ ఆనంద్

వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ .. సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సిటీ​లో వినాయక చవితి ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్​ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. ప్రతి మండపానికి సంబంధిత పోలీస్​ఆఫీసర్ ​వెళ్లి జియో ట్యాగింగ్​ చేయాలన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన టైం, నిమజ్జన టైంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్ల గురించి  సిబ్బందికి వివరించారు.  మూడేండ్లుగా మిలాద్ ఉన్ నబీ కూడా నవరాత్రుల సమయంలోనే వస్తోందని, ఈ ఏడాది కూడా అదే టైంలో రావడంతో ఏం చేయాలన్న దానిపై సూచనలు ఇచ్చారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ పాల్గొన్నారు.