
ముంబై: ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ మొత్తం సబ్స్క్రయిబర్ బేస్ 30 కోట్ల మందికి చేరుకుంది. గ్లోబల్ఓటీటీ కంపెనీ నెట్ఫ్లిక్స్ చివరిగా ప్రకటించిన 30.16 కోట్ల కంటే ఇది కొంచెమే తక్కువ. ఇటీవల ముగిసిన టాటా ఐపీఎల్ తమ సబ్స్క్రయిబర్ల సంఖ్య పెరుగుదలకు కారణమని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జియోహాట్స్టార్ సబ్స్క్రయిబర్ల సంఖ్య ఐదు కోట్లు మాత్రమే ఉంది. అప్పుడు రిలయన్స్ నేతృత్వంలోని జియోసినిమా, డిస్నీ+హాట్స్టార్ విలీనంతో జియోహాట్స్టార్ ఏర్పడింది.
డిస్నీ స్టార్ ఐదు సంవత్సరాలకు రూ.23,575 కోట్లు చెల్లించి ఐపీఎల్టోర్నమెంట్ టీవీ ప్రసార హక్కులను గెలుచుకుంది. అయితే భారతదేశ డిజిటల్ హక్కులను రిలయన్స్కు చెందిన వయాకామ్ రూ.20,500 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జూన్ 3న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో రజత్ పటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు గెలిచింది.
ఈ మ్యాచ్ను డిజిటల్లో 23.7 కోట్ల మంది, టెలివిజన్లో 18.9 కోట్ల మంది చూశారని జియోస్టార్ రిపోర్ట్ తెలిపింది. 2024 డిసెంబర్ చివరి నాటికి 190 దేశాలలో నెట్ఫ్లిక్స్కు 30.16 మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్,- డిసెంబర్లో కొత్తగా 1.8 కోట్ల మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని నెట్ఫ్లిక్స్ తెలిపింది.