
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లిలో జేఎన్టీయూలో శనివారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఎప్సెట్ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్లో అడ్మిషన్స్ కోసం అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వీసీకిషన్కుమార్రెడ్డి సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. సదస్సు హాజరు కావాలనుకునే వారు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని రావాలని సూచించారు.