
శంషాబాద్, వెలుగు: ఏఐ టెక్నాలజీతో సాంకేతిక విప్లవం రాబోతోందని -జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, డీఆర్టీఓ సైంటిస్ట్, వీఈడీఏ, ఏఎస్ఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిషోర్ నాథ్ నాయిని అన్నారు. శంషాబాద్ వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీ సిల్వర్ జూబ్లీతోపాటు 23వ స్నాతకోత్సవ వేడుకలకు వారు ముఖ్య, విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు.