రేపు జేఎన్టీయూహెచ్​కాన్వొకేషన్

రేపు జేఎన్టీయూహెచ్​కాన్వొకేషన్

హైదరాబాద్, వెలుగు:  జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూహెచ్)13వ స్నాతకోత్సవాన్ని ఈ నెల3న నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ టి. కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారామ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నట్టు వెల్లడించారు. ఆదివారం జేఎన్టీయూలో వర్సిటీ రెక్టార్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ర్టార్ వెంకటేశ్వరరావు తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వర్సిటీ జేఎన్ ఆడిటోరియంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కాన్వొకేషన్ ప్రారంభం కానున్నదని వెల్లడించారు. 

ఈ సందర్భంగా సీతారామ్ కు గౌరవ డాక్టరేట్ ను అందించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 92,118 మందికి డిగ్రీలు, 74 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నామని వెల్లడించారు. జేఎన్టీయూకు న్యాక్ ఏప్లస్ గ్రేడ్​తో పాటు ఎన్ఐఆర్ఎఫ్ లో 88వ ర్యాంకింగ్ సాధించినట్టు తెలిపారు.