ఉద్యోగాభ్యర్థుల స్పెషల్.. మొదటి సార్వత్రిక ఎన్నికలు

ఉద్యోగాభ్యర్థుల స్పెషల్.. మొదటి సార్వత్రిక ఎన్నికలు
  • హైదరాబాద్​ రాష్ట్రంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952, ఫిబ్రవరిలో ముగిశాయి. 25 మంది సభ్యులు పార్లమెంట్​కు ఎన్నికయ్యారు.
  • 1952 ఫిబ్రవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్​ శాసనసభకు 175 మంది  ఎన్నికయ్యారు. కాంగ్రెస్​ పార్టీ 93 స్థానాలు గెలుచుకుంది. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన వారి సంఖ్య 46.
  • అప్పటి రాష్ట్ర రాజకీయాల్లో గోసాయి – దేశాయి వర్గాలుగా పేరుపడ్డ కాంగ్రెస్​ వర్గాలు రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు వర్గాలు.
  • 1952 సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టులు పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​ పేరుతో పోటీ చేశారు.
  • పీపుల్స్​ డెమోక్రటిక్​ ఫ్రంట్​ పేరుతో పోటీ చేసిన కమ్యూనిస్టులు హైదరాబాద్​ రాష్ట్ర శాసనసభలో 42 స్థానాలు గెలుచుకున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఎన్నికైన వారి సంఖ్య 35.  సోషలిస్టు పార్టీ 12 స్థానాలు గెలుచుకుంది.
  •  1952 ఎన్నికల్లో ఓటమి పాలైన నిష్కల్మశప్రజా నాయకులు జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు.
  •  హైదరాబాద్​ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి నాయకునిగా బూర్గుల రామకృష్ణారావు ఎన్నికయ్యారు.
  • బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్​ రాష్ట్రానికి 1952 మార్చి 6 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
  • బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్​ రాష్ట్ర గవర్నర్​ సీఎం త్రివేది. స్పీకర్​ కాశీనాథరావు వైద్య, డిప్యూటీ స్పీకర్​ పంపన్​గౌడ్.
  • హైదరాబాద్​ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వి.డి.దేశ్​పాండే.
  •  బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో హోంశాఖ మంత్రి దిగంబరరావు బిందు,​ ఎక్సైజ్​, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రి  కె.వి.రంగారెడ్డి, ఆర్థిక మంత్రి వినాయకరావు విద్యాలంకార్​, వ్యవసాయం, పౌర సరఫరాలు, ప్రణాళికా, అభివృద్ధి శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి, విద్యాశాఖ మంత్రి గోపాలరావు ఎక్బొటే,  సమాచార శాఖ మంత్రి దేవీసింగ్​ చౌహన్​.
  • బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ రాజ్​ప్రముఖ్​గా వ్యవహరించారు.
  •     
  • బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఉన్న ఐసీఎస్​ అధికారి ఎం.కె.వెల్లోడి.
  •  హైదరాబాద్​ రాష్ట్రంలో రక్షిత కౌలుదార్ల చట్టం 1950 జనవరి నుంచి అమల్లో ఉంది.
  • భారతదేశంలో భూకమతాలపై గరిష్ట పరిమితిని విధించిన ప్రథమ ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు పేరుపొందారు.
  • బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిజాం కరెన్సీ, నాణేలు రద్దయి, వాటి స్థానంలో భారత ప్రామాణిక కరెన్సీ అమల్లోకి తీసుకువచ్చింది.
  • మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం హైదరాబాద్​.
  • మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు.
  • ప్రతి 500 జనాభా గల గ్రామానికి పాఠశాలను ఏర్పాటు చేసింది బూర్గుల రామకృష్ణారావు.
  • బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో మొదటి తరగతి నుంచి మాతృభాషలో విద్యా బోధన ప్రవేశపెట్టారు.
  • బూర్గుల రామకృష్ణారావు పాలనా కాలంలో ఐదో తరగతి నుంచి ఇంగ్లీష్​ భాషను ప్రవేశపెట్టారు.
  • వరంగల్​ జిల్లా నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి 1953 అక్టోబర్​ 1న ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశారు.
  •  హైదరాబాద్​ రాష్ట్రంలో అవినీతి నిరోధకశాఖను 1955 జులై 1న ఏర్పాటు చేశారు.
  • నాగార్జున సాగర్​ బహుళార్ధసాధక ప్రాజెక్టుకు 1955 డిసెంబర్ 10న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శంకుస్థాపన చేశారు.
  • తెలంగాణలో భూదానోద్యమం 1951 ఏప్రిల్​ 18న నల్లగొండ జిల్లాలోని పోచంపల్లి నుంచి ప్రారంభమైంది.
  • భూదానోద్యమానికి మొట్టమొదటి భూమి దానం చేసిన భూమి పోచంపల్లికి చెందిన దేశ్​ముఖ్​ వెదిరె రామచంద్రారెడ్డి.
  •     
  • ముల్కీఉద్యమం ఆంధ్రా గోబ్యాక్​ ఇడ్లీ సాంబార్​ గో బ్యాక్​ నినాదాలతో ప్రారంభమైంది.
  • విద్యార్థులు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి 1952 జులై 26న వరంగల్​ వేలాది మందితో బ్రహ్మాండమైన ప్రదర్శన నిర్వహించారు.
  •     
  • ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో వరంగల్​లో విద్యార్థి ఐక్యకార్యాచరణ కమిటీ మరోసారి బ్రహ్మాండమైన ప్రదర్శన జరిపిన తేదీ 1952 ఆగస్టు 27.
  • హన్మకొండలో విద్యార్థులపై పోలీసులు 1952 ఆగస్టు 30వ తేదీన లాఠీఛార్జీ జరిపారు.
  • హన్మకొండలో విద్యార్థులపై లాఠీఛార్జీకి నిరసనగా హైదరాబాద్​లో 1952 ఆగస్టు 31న సమ్మె నిర్వహించారు.
  •  హైదరాబాద్​లో విద్యార్థులు నాన్​ ముల్కీ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్​ గో బ్యాక్​ స్టూడెంట్​ యూనియన్​ జిందాబాద్​ నినాదాలతో 1952 సెప్టెంబర్​ 2న భారీ ర్యాలీ నిర్వహించారు.
  • 1952 సెప్టెంబర్​ 3, 4వ తేదీల్లో విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా జరిపిన  కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు.
  • విద్యార్థులపై జరిపిన కాల్పులపై విచారణకు 1952 సెప్టెంబర్​ 5న ప్రభుత్వం జస్టిస్​ పింగళి జగన్మోహన్​రెడ్డి కమిటీ వేసింది.
  • ముల్కీ నిబంధనల రూపకల్పనపై బూర్గుల ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని 1952 సెప్టెంబర్ 7న ఏర్పాటు చేసింది.
  • ముల్కీ నిబంధనల అమలుపై బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులు కొండా వెంకటరంగారెడ్డి, జి.ఎస్​. మేల్కోటే, పూల్​చంద్​ ప్రేమ్​చంద్ గాంధీ, మెహదీ నవాజ్​ జంగ్​.
  • ముల్కీ ఉద్యమంలో పాల్గొని ప్రివెంటివ్​ డిటెన్షన్​ (పీడీ) చట్టం కింద 1952 సెప్టెంబ్​ 13న ఎమ్మెల్యే సయ్యద్​ అక్తర్​ హుస్సేన్​ అరెస్టయ్యారు.